ePaper
More
    HomeతెలంగాణMajor Road Accident | వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

    Major Road Accident | వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: major road accident : వికారాబాద్ జిల్లా(Vikarabad district)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రగాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

    వికారాబాద్ పరిగి మండలం(Parigi mandal) రంగాపూర్ (Rangapur) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను సందీప్, మల్లేష్, బాలమణి, హేమలతగా గుర్తించారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి(Chenvelli village) గ్రామానికి చెందినవారు పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    ఈ ఘటన జరిగిన సమయంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పరిగి ప్రభుత్వాసుపత్రికి parigi district hospital తరలించేలోగా మరో ముగ్గురు చనిపోయారు. పలువురి చేతులు, కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...