అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | హైదరాబాద్ hyderabad ఓల్డ్ సిటీ Old cityలోని గుల్జార్హౌజ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై Gulzar House fire accident ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి cm revanth reddy విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది fire staff సకాలంలో స్పందించి దాదాపు 40 మందిని కాపాడారని ఆయన పేర్కొన్నారు.