Pm Modi | సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్​కు మోదీ.. ఎయిర్​పోర్టులోనే సమీక్ష
Pm Modi | సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్​కు మోదీ.. ఎయిర్​పోర్టులోనే సమీక్ష

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pm Modi : జమ్ముకశ్మీర్‌లోని పహల్​గామ్​లో ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడి యావత్​ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే విరమించుకున్నారు. నేడు(బుధవారం) ఉదయం మోడీ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం రాత్రి సౌదీ అరేబియా అధికారికంగా ఏర్పాటు చేసిన డిన్నర్‌లో ప్రధాని మోడీ పాల్గొనలేదు. ఆ రాత్రే ఆయన భారత్‌కు బయలుదేరారు.

Pm Modi | ఎయిర్​పోర్టులోనే భేటీ

సౌదీ అరేబియా నాయకత్వంతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఇప్పటికే మాట్లాడారు. ప్రధాని మోడీ పర్యటన మధ్యలోనే విరమించడంపై వారికి వివరణ ఇచ్చారు. ఉదయం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని ఎయిర్​పోర్టులోనే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీతో భేటీ అయ్యాయి. పహల్​గామ్​ ఘటనపై చర్చించారు. అంతేకాకుండా కాసేపట్లో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.