అక్షరటుడే, వెబ్డెస్క్: Deputy Tahsildars Transfer | రాష్ట్రంలో పలువురు డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. జోన్–1, 2, 3 పరిధిలోని 23 మంది డీటీలను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జోన్–1 పరిధిలో ఐదుగురు, జోన్–2 పరిధిలో 16 మంది, జోన్–3 పరిధిలో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. త్వరలోనే బదిలీ అయిన నాయబ్ తహశీల్దార్లు తమతమ స్థానాల్లో రిపోర్ట్ చేయనున్నారు.
డీటీల అభ్యర్థన మేరకు..
లోక్సభ ఎన్నికల సందర్భంగా పరిపాలనా కారణాలతో అప్పట్లో తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి వారు ఆ ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. తిరిగి తమ పాత స్థానాలకు పంపాలని సీసీఎల్ను వారు అభ్యర్థించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ జోన్-1, 2, 3లలో బదిలీలు నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు.
