The Resistance Front : జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) తొలుత ఆన్లైన్ వేదికగా పురుడు పోసుకుంది. అది ప్రారంభమైన ఆర్నెళ్లలోనే ఆఫ్లైన్ సంస్థగా ఆవిర్భవించింది. ఆగస్టు 5, 2019న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉద్భవించింది. ప్రారంభంలో ఆన్లైన్ ఫోరమ్ అయిన ఈ ఉగ్రవాద సంస్థ ఆరు నెలల్లోపు ఆఫ్లైన్ సంస్థగా మారింది. తాజాగా జమ్మూలో కాల్పులకు తెగబడి 27 మందిని పొట్టనబెట్టుకుంది.
The Resistance Front : లష్కరేకు అనుబంధంగా..
లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ఏర్పాటైన రెసిస్టెన్స్ ఫ్రంట్ స్వల్ప కాలంలోనే వేగంగా విస్తరించింది. పాకిస్తాన్ లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న టీఆర్ఎఫ్.. ఇప్పుడు కాశ్మీర్లో కార్యకలాపాలు సాగించే స్థాయికి ఎదిగింది. లష్కరే, ఇతర ఉగ్రవాద గ్రూపుల నుంచి నియామకాలు జరుపుకొంటూ ఈ బృందం అనేక దాడులకు బాధ్యత వహిస్తోంది. దాని వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్ గుల్ లేదా షేక్ సజ్జాద్. పాకిస్తాన్, హఫీజ్ సయీద్కు సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. కాశ్మీర్లో “స్థానిక అణచివేతకు” వ్యతిరేకమని పేర్కొన్నారు.
The Resistance Front : సజ్జాద్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
అక్టోబర్ 10, 1974న శ్రీనగర్లో జన్మించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్కు కేంద్ర ప్రభుత్వం 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. 2022 డేటా ప్రకారం.. జమ్మూ, కాశ్మీర్లో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన 172 మంది ఉగ్రవాదులలో 108 మంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన వారేనని తేలింది. అయినప్పటికీ ఆ సంస్థ 74 మంది నియమించుకున్నట్లు గుర్తించారు.