ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక మార్పు!

    IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక మార్పు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భారత్ తిరిగి రావడానికి జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(Jake Fraser McGurk) సుముఖంగా లేకపోవడంతో అతని స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌(Mustafizur Rahman)తో ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరంగా ఉండాలని భావించిన జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుందని పేర్కొన్నారు.

    రూ. 6 కోట్లకు ముస్తాఫిజుర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. అయితే ఓపెనర్ స్థానంలో పేసర్‌(Pacer)ను ఎంచుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్ తీవ్రంగా నిరాశపరిచాడు. 6 మ్యాచ్‌ల్లో 9.17 సగటుతో 55 పరుగులే చేశాడు. తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. గత సీజన్‌లో 234.04 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేసిన అతన్నిఆర్‌టీఎం(RTM) ద్వారా ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ జేక్ ఫ్రెజర్ జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు.

    మరోవైపు మెగా వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్‌గా నిలిచాడు. చివరకు జేక్ ఫ్రెజర్(Jake Fraser) రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇప్పటి వరకు 57 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 61 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటి వరకు ఏడు సీజన్లు ఆడి సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కీలక ప్లే ఆఫ్స్ ముంగిట బలహీనంగా మారిన బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్.. ముస్తాఫిజుర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ చివరి 3 మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...