అక్షరటుడే, వెబ్డెస్క్:Armoor | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆర్మూర్ మండలం చేపూర్ శివారులో జాతీయ రహదారి 63పై బుధవారం ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. ఆర్మూర్కు చెందిన అర్జున్, నరేందర్ బైక్పై మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వస్తుండగా.. చేపూర్ శివారులో కరీంనగర్ వైపు వెళ్తున్న డీసీఎం(DCM) ఢీకొంది. ఈ ప్రమాదంలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా.. నరేందర్ ఆర్మూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో హైవేపై ట్రాఫిక్ జామ్ కాగా.. పోలీసులు(Police) అక్కడకు చేరుకొని క్లియర్ చేశారు.