అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: TG Polycet | ఉమ్మడి జిల్లాలో పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 6,111 మంది హాజరైనట్లు జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డిలో 2,766 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya), కామారెడ్డిలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.