Pakistan Drone attack | మరోసారి పాక్ కవ్వింపు చర్య.. సరిహద్దులో డ్రోన్లతో దాడి
Pakistan Drone attack | మరోసారి పాక్ కవ్వింపు చర్య.. సరిహద్దులో డ్రోన్లతో దాడి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Drone attack : భారత్, పాక్​ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్స్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే దాయాది దేశం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జమ్మూకశ్మీర్ సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్​ నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. వాటిని భారత క్షిపణి రక్షణ వ్యవస్థ నేలకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లో బ్లాక్‌ అవుట్‌ అమలు చేస్తున్నారు.

ఇక, భారత్​ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగ, ఆవేశ పూరిత ప్రసంగం తర్వాత పంజాబ్​ సరిహద్దులోనూ బ్లాక్​ అవుట్​ ప్రకటించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.