Legal Services Authority | చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం
Legal Services Authority | చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Legal Services Authority | భారతీయ న్యాయ చట్టాలపై (Indian legal codes) ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్​ సివిల్​ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి (District Legal Services Authority) ఉదయభాస్కర్​రావు అన్నారు. చట్టాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మోర్తాడ్​ మండలం తిమ్మాపూర్​ గ్రామంలోని బుద్ధ విహార్​(Timmapur Buddha Vihar)ను సోమవారం సందర్శించారు. అనంతరం గ్రామంలో న్యాయచట్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. లోక్​ అదాలత్​లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తారని వివరించారు. రాజీమార్గమే.. రాజమార్గమన్నారు. లోక్​ అదాలత్​లో సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. కార్యక్రమంలో మోక్షానంద స్వామీ, తిమ్మాపూర్​ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.