ePaper
More
    Homeఅంతర్జాతీయంDGMO Meeting | ముగిసిన భారత్‌-పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు

    DGMO Meeting | ముగిసిన భారత్‌-పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGMO Meeting | భారత్​, పాకిస్తాన్​ డెరెక్టర్​ జనరల్​ ఆఫ్​ మిలిటరీ ఆఫరేషన్స్​ (DGMO) చర్చలు ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్​లైన్ hotline​ ద్వారా చర్చించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై వారు చర్చించారు. కాగా పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్​ పేరిట ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

    ఆపరేషన్​ సిందూర్ operation sindooor ​కు ప్రతీకారంగా భారత్​లోని ప్రాంతాలపై పాకిస్తాన్​ దాడులకు యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను తిప్పికొట్టింది. దాయాది దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసింది. అనంతరం భారత్​ కూడా పాకిస్తాన్​లోని ఎయిర్​బేస్​లు, మిలిటరీ స్థావరాలపై భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలో శనివారం ఇరుదేశాల డీజీఎంవోలు చర్చించి కాల్పుల విరమణ ceasefireకు అంగీకరించారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.

    కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కొద్ది గంటలకే పాక్​ ఉల్లంఘించింది. మళ్లీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే భారత్​ పాక్​ దాడులను తిప్పి కొట్టింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ చర్చించాలని ఇరుదేశాల డీజీఎంవోలు నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది. భారత్​ తరఫున డీజీఎంఓ రాజీవ్​ ఘాయ్​ చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పాక్​దాడులు, కాల్పుల విరమణ గురించి ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మీటింగ్​లో జరిగిన అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...