అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి CM Revanth Reddyపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత MLC Kavitha సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి సీఎం భారీగా కమీషన్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం congress govt రూ.లక్షా 80 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చిందన్నారు. ఈ అప్పులతో ప్రభుత్వం కొత్తగా ఏ పనులు చేపట్టలేదని విమర్శించారు. ఈ డబ్బులతో ఏ పనులు చేశారోనని తాము అధ్యయనం చేశామన్నారు. రేవంత్రెడ్డి ఒక ప్రాజెక్ట్ కట్టలేదని, రైతు భరోసా rythu bharosa పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు. రుణమాఫీ loan waiver కూడా పూర్తిగా చేయలేదని పేర్కొన్నారు.
అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని కవిత మండిపడ్డారు. పెన్షన్లు పెంచలేదని, తులం బంగారం హామీ అమలు చేయలేదన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ అటే పోయిందని ఎద్దేవా చేశారు. కానీ అప్పులు తెచ్చి డబ్బులు మాత్రం నొక్కేశారన్నారు.
MLC Kavitha | 20 శాతం కమీషన్ వసూలు
రేవంత్రెడ్డి తాను తెచ్చిన రూ.లక్షా 80 వేల కోట్ల అప్పులో నుంచి రూ.80 వేల కోట్లు అప్పులు చెల్లించారని కవిత తెలిపారు. మిగతా రూ.లక్ష కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించిందని ఆరోపించారు. గతంలో చేసిన పనుల కోసం 20 శాతం కమీషన్ తీసుకొని ఈ బిల్లులు చెల్లించారన్నారు. రూ.20 వేల కోట్లు సీఎం రేవంత్రెడ్డి సొంత ఖాజానాకు పోయాయాని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.