ePaper
More
    Homeక్రైంSadashiva Nagar | కారు బోల్తా.. నేవి ఉద్యోగి భార్య మృతి

    Sadashiva Nagar | కారు బోల్తా.. నేవి ఉద్యోగి భార్య మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Sadashiva Nagar | ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటనలో ఓ నేవి ఉద్యోగి భార్య మృతి చెందింది. ఈ ఘటన సదాశివనగర్‌ మండలం మర్కల్‌ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్‌కు చెందిన అముల్‌ నేవిలో పనిచేస్తుండగా, సెలవులు రద్దు కావడంతో తన భార్య ప్రణీత(19)తో కలిసి కారులో విశాఖపట్నం బయలుదేరారు. ఈ క్రమంలో కారు మర్కల్‌ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బోల్తా పడింది. దీంతో కారులోని ప్రణీత అక్కడికక్కడే మృతి చెందగా, సీటు బెల్టు పెట్టుకున్న అముల్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

    More like this

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట...

    America | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ సన్నిహితుడు చార్లి కిర్క్...