ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సాయిచైతన్య

    Nizamabad CP | పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సాయిచైతన్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (polytechnic common entrance examination) సందర్భంగా అన్ని ఎగ్జామ్​ సెంటర్ల వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (police commissioner sai chaitanya) తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్ష జరుగనుందన్నారు. మొత్తం 16 కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (section 163 BNSS) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల (exam centers) వద్ద గుమ్మిగూడరాదన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లను ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసివేయాలన్నారు. ఈ ఉత్తర్వులు ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...