Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి 88 ఫిర్యాదులు

Prajavani | ప్రజావాణికి 88 ఫిర్యాదులు

జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 88 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్​ అంకిత్​ తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో (Collectorate Nizamabad) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 88 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్​తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్ (DRDO Sayagoud), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్​లకు (Bodhan ACP Srinivas) విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.