అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 74,020 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.27 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
