అక్షరటుడే, వెబ్డెస్క్: Lord Rama bronze statue | గోవాలో శుక్రవారం (నవంబర్ 28) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారు.
మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని “సార్ధ పంచశతమానోత్సవ్” వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఇక్కడ రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ను సైతం ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను ప్రధాని మోడీ విడుదల చేశారు.
Lord Rama bronze statue | శిల్పి ఎవరంటే…
ప్రపంచంలోనే ఎత్తైన ఈ 77 అడుగుల శ్రీ రాముని విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ వి.ఎస్. సుతార్ తయారు చేశారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీని సైతం ఈయనే తీర్చిదిద్దారు.
ఇక ప్రధాని మోడీ కర్ణాటకలోని ఉడిపిని కూడా సందర్శించారు. అక్కడి శ్రీకృష్ణ మఠంలో దాదాపు 1,00,000 మందితో కలిసి లక్ష్మీకాంత గీతా పారాయణంలో పాలుపంచుకున్నారు.
#WATCH | Goa | Prime Minister Narendra Modi unveiled a 77-foot statue of Lord Ram made up of bronze at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math.
The Prime Minister is visiting the math on the occasion of ‘Sardha Panchashatamanotsava’, the 550th-year celebration of the… pic.twitter.com/LgSQEvASbc
— ANI (@ANI) November 28, 2025