అక్షరటుడే ఇందూరు: Panchayat Elections | రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ డివిజన్లోని (Nizamabad division) 8 మండలాలకు ఆదివారం ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం పోలింగ్ ముగిసే సమయానికి (ఒంటి గంట వరకు) 72.56 శాతం ఓట్లు పోలయ్యాయి.
Panchayat Elections | ఒంటిగంట వరకు..
అయితే సమయం ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల్లో (polling stations) ఉన్న వారిని ఓటు వేయడానికి అనుమతించారు. మరి కాసేపట్లో తుది ఓటింగ్ శాతం తేలనుంది. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ధర్పల్లిలో మండలంలో 68.30 శాతం, డిచ్పల్లిలో 62.68 శాతం, ఇందల్వాయిలో 75.29, జక్రాన్పల్లిలో 72.80 శాతం, మాట్లూరులో 76.66 శాతం, మోపాల్ మండలంలో 78.95శాతం, నిజామాబాద్ రూరల్లో 80.47శాతం, సిరికొండ మండలంలో 73.13 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2,38,838 ఓట్లకు గాను.. ఇప్పటివరకు 1,73,296 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.