Homeజిల్లాలునిజామాబాద్​Ration Rice | 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..

Ration Rice | 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..

ప్రజాపంపిణీకి వినియోగించాల్సిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతోంది. ఆర్మూర్​ పట్టణంలోని రాజారాంనగర్​ నుంచి రేషన్​ బియ్యాన్ని రైస్​మిల్​కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Ration Rice | పట్టణం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆర్మూర్​ సీఐ సత్యనారాయణ (Armoor CI Satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజారాంనగర్ నుంచి రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.

ఐచర్ వాహనంలో రేషన్ బియ్యంను తరలిస్తుండగా పెర్కిట్​కు చెందిన డ్రైవర్ సల్మాన్​ను పట్టుకున్నారు. అతడిని విచారించగా రాజారాంనగర్ కాలనీ చెందిన మదనం ఎల్లయ్య, సంజీవులు కలిసి రేషన్​ బియ్యాన్ని (ration rice) అడవి మామిడిపల్లిలోని నాగేష్ రైస్​మిల్లులో అప్పజెప్పాలని సూచించడంతో తాను తీసుకెళ్తున్నట్లు డ్రైవర్​ పేర్కొన్నాడు.

దీంతో వాహనాన్ని, డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని సివిల్​ సప్లయ్స్​ అధికారులకు (Civil Supply officials) సమాచారం అందించారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఐచర్ వాహన డ్రైవర్ సోహైల్​, ప్రజాపంపిణీ బియ్యంను బయటకు తరలిస్తున్న మదనం ఎల్లయ్య, సంజీవ్, రైస్​మిల్ యజమాని నాగేష్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.