అక్షరటుడే, వెబ్డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్పాస్లను (Toll Pass) అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఎన్హెచ్ఏఐ (NHAI) టోల్పాస్లను జారీ చేస్తుంది. నాన్ కమర్షియల్ వాహనాలకు రూ.3 వేలు చెల్లించి పాస్ తీసుకుంటే.. ఏడాది పాటు 200 సార్లు టోల్ గేట్ల మీదుగా ఫ్రీగా వెళ్లొచ్చు.
టోల్పాస్లు అమలులోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో విక్రయాలు జరగడం గమనార్హం. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఎన్హెచ్ఏఐ ఏకంగా 5 లక్షల పాస్లను జారీ చేసింది. దీంతో రూ. 150 కోట్ల ఆదాయం వచ్చింది. టోల్పాస్ల కొనుగోలులో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా.. కర్ణాటక, హర్యానా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజాలలో ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ల ద్వారా అత్యధిక లావాదేవీలను నమోదు చేశాయని NHAI తెలిపింది.
Toll Pass | రూ.3 వేలతో..
ప్రైవేట్ వాహనాలు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల్లో ప్రయాణించడానికి కేంద్రం వార్షిక టోల్పాస్లు తీసుకొచ్చింది. ఇప్పుడున్న ఫాస్టాగ్ (FASTag) ద్వారానే టోల్పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. రూ.3వేలు చెల్లించి ఈ పాస్ పొందితే 200 ట్రిప్లు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. దీంతో ఒక్కసారి టోల్గేట్ దాటడానికి సగటున రూ.15 ఛార్జీ అవుతోంది. ఎక్కువగా జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కార్లు, జీపులు వ్యాన్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.
Toll Pass | ఇలా పొందొచ్చు
రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్, NHAI వెబ్సైట్లు, FASTag జారీచేసే పోర్టల్ల ద్వారా టోల్ పాస్లు పొందొచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్నే టోల్పాస్గా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రెండు గంటల్లోపు పాస్ యాక్టివేట్ అవుతుంది. దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలలోని దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో పాస్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. అయితే రాష్ట్ర రాహదారులపై మాత్రం ఇది వర్తించదు.