అక్షరటుడే, హైదరాబాద్: Special Trains | ప్రయాణికుల(passengers) రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు, రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది.
Special Trains | ఆ రోజుల్లో అందుబాటులోకి..
తిరుపతి-హిసార్(Tirupati – Hisar) మధ్య 12 సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు ప్రతి ఆది, బుధవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనికితోడు కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
Special Trains | అత్యధికంగా..
అత్యధికంగా నరసాపూర్-తిరువణ్ణామలై(Narasapur – Tiruvannamalai) మార్గంలో రైళ్లు నడవనున్నాయి. ఈ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులో రాన్నాయి. బుధ, గురువారాల్లో ప్రత్యేక రైళ్లు ఈ మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయి. కొత్తగా తీసుకురాబోతున్న ఈ ప్రత్యేక రైళ్లన్ని జులై 9 నుంచి సెప్టెంబరు 25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
Special Trains | ముందస్తు రిజర్వేషన్..
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులకు మరో వెసులుబాటు కూడా ఉంది. వీరి కోసం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్లో రైళ్ల సమయం, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.