ePaper
More
    HomeజాతీయంBihar Elections | మహిళలకు 35శాతం రిజర్వేషన్​.. బీహార్​ సీఎం సంచలన ప్రకటన

    Bihar Elections | మహిళలకు 35శాతం రిజర్వేషన్​.. బీహార్​ సీఎం సంచలన ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar Elections | బీహార్​ సీఎం నితీష్​కుమార్ (Bihar CM Nitish Kumar)​ సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు 35 శాతం రిజర్వేషన్​ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని రకాల పోస్టులకు దీనిని వర్తింపచేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

    Bihar Elections | మొదలైన ఎన్నిక వేడి

    బీహార్​లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2015 నుంచి నితీశ్​కుమార్​ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆయన తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్​ సాయంతో సీఎం అయ్యారు. అనంతరం ఆర్జేడీతో తెగదింపులు చేసుకొని మళ్లీ ఎన్డీఏ పక్షాన చేరారు. అయితే సీఎం పదవి కోసం ఆయన అటు ఇటు తిరగడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అంతేగాకుండా ఆయన 2015 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఆర్జేడీ(RJD), కాంగ్రెస్​ కూటమి ఎలాగైనా అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న నితీశ్​కుమార్​ తాజాగా రిజర్వేషన్​ అస్త్రాన్ని ప్రయోగించారు.

    Bihar Elections | తీవ్రంగా పోటీ

    బీహార్​లో బీజేపీ, జేడీయూ, ఎల్​జేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్​ జత కట్టనున్నట్లు సమాచారం. అలాగే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore)​ కూడా జన్​ సురాజ్​ పార్టీ(Jan Suraj Party)ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. ఈ క్రమంలో పోటీ తీవ్రంగా ఉండనుంది. అధికారానికి దూరంగా ఆర్జేడీ ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో సీఎం నితీశ్​కుమార్​ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు పథకాలు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మహిళలకు 35శాతం రిజర్వేషన్లు (35 Percent Reservation For Womens) అమలు చేస్తామని ప్రకటించారు.

    ఇప్పటికే మహిళలకు పెన్షన్‌ను ఎన్డీఏ సర్కారు​ పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.400గా ఉన్న పెన్షన్‌ను రూ.1100లకు పెంచుతూ సీఎం నితీశ్​కుమార్​ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10న పెరిగిన పింఛన్​ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

    Bihar Elections | యువజన కమిషన్​ ఏర్పాటు

    మహిళలతో పాటు యువ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నితీశ్​కుమార్​ ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా బీహార్ యువజన కమిషన్(Bihar Youth Commission) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిషన్​ ద్వారా యువకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి.. ఉద్యోగాలు కల్పించడమే ఈ కమిషన్​ ఉద్దేశం అన్నారు.

    Bihar Elections | మోదీ, రాహుల్​ పర్యటనలు

    బీహార్​ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi) ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవల మోదీ బీహార్​లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. రాహుల్​ గాంధీ సైతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్​ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ​వ్యాపారవేత్త గోపాల్​ ఖేమ్కా హత్యపై రాహుల్​ స్పందిస్తూ.. బీహార్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుండాల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...