అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: 27th Division Congress Candidate | ప్రజల సహకారంతో డివిజన్లోని కాలనీలన్నింటిని అభివృద్ధి చేసి చూపిస్తానని 27వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని పెంటి కళ్యాణి దేవిదాస్ (Penti Kalyani Devidas) అన్నారు. ఈ మేరకు ఆనంద్నగర్ (Anand Nagar) తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటించారు.
27th Division Congress Candidate | ఒక్కసారి అవకాశం ఇవ్వండి..
ఈ సందర్భంగా అభ్యర్థిని పెంటి కల్యాణి దేవిదాస్ మాట్లాడుతూ ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. డివిజన్లోని మౌలిక సదుపాయాల కల్పనకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అలాగే ప్రజలతోనే ఉండి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకుండా ముందుకు వెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Telanagana Congress government) ఉన్నందున వారి సహకారంతో నగరంలోని 27వ డివిజన్కు ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని కళ్యాణి దేవిదాస్ అన్నారు. కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.