అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive| డ్రంకన్ డ్రైవ్ కేసులో 24 మందికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సీపీ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 46 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని మార్నింగ్ కోర్టులో హాజరుపర్చారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ 24 మందికి జైలు శిక్ష విధించారు. 22 మందికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఏసీపీ తెలిపారు.
