ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు బీఎన్​ఎస్​163 (BNS 163) చట్టం అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గల్ఫ్ బాధిత కుటుంబాల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అబద్ధాలు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వేల్పూరు వస్తున్నట్లు మానాల తెలిపారు. ప్రశాంత్​రెడ్డి వేల్పూర్​ రావాలని ఆయన సవాల్​ విసిరారు. దీంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో సీపీ సాయి చైతన్య బీఎన్​ఎస్​ 163 యాక్ట్​ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    More like this

    Eagle Team | ముంబైలో ఈగల్​ టీమ్​ స్పెషల్​ ఆపరేషన్​.. డ్రగ్స్​, హవాలా రాకెట్​ గుట్టురట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | ముంబైలో తెలంగాణ (Telangana) ఈగల్​ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు....

    Stock Market | నిలదొక్కుకునేనా? లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు...

    Mahalaya Paksham | మహాలయ పక్షం.. పితృదేవతలకు ప్రీతికరమైన కాలం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahalaya Paksham | భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న...