అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నారాయణగిరి షెడ్ వద్ద లైన్ ఆడ్ చేసి నేరుగా పంపిస్తున్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 79,467 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.42 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.