అక్షరటుడే, ఇందూరు : Prajavani | ప్రజావాణికి (Prajavani) ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టరేట్లో (Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
