Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి 104 ఫిర్యాదులు

Prajavani | ప్రజావాణికి 104 ఫిర్యాదులు

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ అంకిత్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Prajavani | ప్రజావాణికి (Prajavani) ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టరేట్​లో (Collectorate)​ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్​తో పాటు డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్​లకు అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.

Must Read
Related News